న్యాయంపై కాంగ్రెస్ మాట్లాడడం విచిత్రంగా ఉంది: ప్ర‌ధాని

64చూసినవారు
న్యాయంపై కాంగ్రెస్ మాట్లాడడం విచిత్రంగా ఉంది: ప్ర‌ధాని
సామాజిక న్యాయంపై కాంగ్రెస్ మాట్లాడడం విచిత్రంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వాలనుకోలేదు. కానీ తమ కుటుంబసభ్యులకు మాత్రం ఇచ్చుకున్నారు. నెహ్రూ ఘనతను పెంచేందుకు అంబేడ్కర్‌ను శ్యామ్ పిట్రోడా అవమానించారు. ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ వ్యతిరేకం. రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు. అంబేడ్కర్ లేకుంటే రిజర్వేషన్లు వచ్చేవి కావు అని మోదీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్