ఇంటి సరిహద్దు విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య ఇంటి సరిహద్దు విషయంలో గంధం సిద్దు, సమ్మయ్య, అంజి, సతాళం గట్టన్న, గంధం కుమార్, అనిల్, పాస్టo శారద, వాస్తవం ప్రవీణులపై కళ్లెం తిరుపతి, ఆయన వర్గీయులు బుధవారం పారా, గడ్డపార, గొడ్డలి లాంటి పదునైన పనిముట్లతో దాడి చేసారు. తీవ్రంగా గాయపడ్డ వీరిని జగిత్యాలలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.