చెన్నై ఆవడి సమీపంలోని ముతపుటుబెట్టైలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ నగల దుకాణంలోకి నలుగురు దుండగులు చొరబడ్డారు. దుకాణ యజమాని ప్రకాష్ను కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి బంధించారు. అనంతరం సిబ్బందిని తుపాకీతో బెదిరించి, రూ.1.50 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ చోరీపై ముఠాపుత్తుపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.