తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్, సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. కమిషన్ ఛైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి సహా, సభ్యులు రాజీనామా చేయగా.. గవర్నర్ తమిళిసై తాజాగా ఆమోదముద్ర వేశారు. టీఎస్పీఎస్సీకి ఛైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దీంతో కొత్త కమిషన్ ఏర్పాటు నియామకానికి లైన్ క్లియర్ అయినట్లైంది. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యే ఛాన్స్ ఉంది.