అసత్య వార్తలు ప్రచురించడం మంచిది కాదు: వెంకన్న గుప్తా

2225చూసినవారు
బాన్సువాడ పట్టణంలో ఆదివారం జరిగిన వైశ్య సంఘ సమావేశంలో నిధుల దుర్వినియోగం జరిగిందని అసత్య వార్తలు ప్రచురించడం మంచిది కాదని నాగులగామ వెంకన్న గుప్తా అన్నారు. సోమవారం పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిధుల దుర్వినియోగంపై ఎలాంటి అవకతవకలు జరగలేదని సంఘ సభ్యులు అందరూ కలిసి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనే నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిర్న దత్తు, నాగరాజు, వైశ్య సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్