జుక్కల్లో సోమవారం పొలాల అమావాస్య నిర్వహించారు. రైతులు ఉదయాన్నే బసవన్నలను చెరువులో స్నానాలు చేయించి, పంట చేనులో పాండవులకు నైవేద్యం, పోలేలు పెట్టి, సాయంత్రం సమయాన హనుమాన్ మందిర్ వద్ద రైతులందరూ బసవన్నలను ముస్తాబు చేసి వచ్చి బజార్ హనుమాన్, వీర హనుమాన్ దర్శనం చేయించారు. అనంతరం బసవన్నలకు పెళ్లి చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. రైతులను సత్కరించారు.