భారీ వర్షాలకు నాగిరెడ్డిపేట మండలం జప్తి జాన్కంపల్లి ఊరు చెరువు అలుగు పారడంతో గ్రామ మాజీ సర్పంచ్ సాయిలు, ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామస్థులు ఊర చెరువు అలుగు పారే నీటి వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని అతిపెద్ద చెరువులు బొల్లారం, జాప్తి జానకంపల్లి చెరువు నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.