కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామానికి రాకపోకలు నిలిచి పోయాయని తహసీల్దార్ ముజీబ్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి వరద నీటి ప్రవాహం పెరగడంతో గ్రామానికి వెళ్లే లెండివాగు వంతన పైనుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోందన్నారు. బ్రిడ్జి ప్రాంతంలో వరద నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. లెండి వాగు పరివాహక గ్రామాల ప్రజలు వాగు వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.