బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 5 వేలు ఆర్థిక సాయం

83చూసినవారు
బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 5 వేలు ఆర్థిక సాయం
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామానికి చెందిన కొల్పుల కాశిరం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి 5 వెల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్