
జోసా కౌన్సెలింగ్లో ఈసారి 127 విద్యాసంస్థలు
దేశవ్యాప్తంగా వచ్చే విద్యాసంవత్సరం(2025-26)లో జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ(జోసా) ద్వారా 127 విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది జోసా కింద 121 విద్యాసంస్థలుండగా.. ఈసారి కొత్తగా ఆరు సంస్థలు చేరాయి. గతఏడాది మొత్తం 59,917 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించగా, ఈసారి సీట్లు పెరగనున్నాయి. ఇక ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఫలితాలు జూన్ 2వ తేదీన వెల్లడవుతాయి.