2వ వార్డులో దోమల నియంత్రణకు ఫాగింగ్

83చూసినవారు
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ రెండవ వార్డులో దోమల తీవ్రత ఎక్కువగా ఉండి, దోమలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ విషయంలో 2వ వార్డు కౌన్సిలర్ మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్, కమిషనర్ శ్రీహరి రాజు స్పందించి మున్సిపల్ సిబ్బందితో శనివారం రాత్రి ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల మందు స్ప్రే చేయించారు. ఎల్లారెడ్డిలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణం అంత ఫాగింగ్ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్