భిక్కనూర్ లో ప్రారంభమైన బాలహనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన

81చూసినవారు
భిక్కనూర్ లో ప్రారంభమైన బాలహనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన
ఎల్లారెడ్డి మండలం భిక్కనూరులో గురువారం బాలహనుమాన్ స్వామి విగ్రహ ప్రాణప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు పూజారి రాజేశ్వర్ రావు శర్మ పంతులు, సిద్దుపంతులు, సాయి పంతులు చేత పలు పూజా కార్య క్రమాలు, అభిషేకాలు, యజ్ఞం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు ఉదయం 8గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్ వర్గము, మాతృక, నవగ్రహ క్షేత్రపాలక యోగిని తదితర పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్