వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ. ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహన దారులు సహకరించాలన్నారు. వాహనం నడిపే డ్రైవర్ అన్ని జాగ్రతలతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు, రహదారులపై వేగనియంత్రణ పాటించాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, నిబంధనల మేరకు వాహనాల నంబర్ ప్లేట్ సరిగా ఉండాలన్నారు.