తెలంగాణలోని ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కొండగట్టు తరలివచ్చి, అంజన్నను దర్శించుకుంటున్నారు. ఎక్కువ మంది భక్తులు తలనీలాలు సమర్పించిన అనంతరం కోనేరులో స్నానం ఆచరించి, దర్శనానికి క్యూ కడుతున్నారు. అధికారులు భక్తులు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.