రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన మహిళ అప్పుల బాధ భరించలేక మిడ్ మానేరులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. శుక్రవారం విశ్వాసనీయ సమాచారం అందుకున్న బోయినపల్లి ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను రక్షించి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేసి అప్పగించారు. ఆయనతోపాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.