ప్రాథమిక పాఠశాలలో వీడ్కోలు పార్టీ

1062చూసినవారు
ప్రాథమిక పాఠశాలలో వీడ్కోలు పార్టీ
ధర్మారం మండలం కటికెనపల్లి ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తయిన విద్యార్థులకు బుధవారం వీడ్కోలు వేడుక నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల హెచ్ఎం సురుకంటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ. ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని ఉన్నత పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్