రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: విప్

75చూసినవారు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఐకెపి కేంద్రాల వద్ద అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. గతంలో తూకం, తాలు పేరుతో క్వింటాలుకు 4 నుండి 5 కిలోల వడ్లను కట్ చేశారని చెప్పారు. అధికారులు, మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్