జగిత్యాల జిల్లా ఎండపల్లి 132కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ధర్మారం మండలంలోని మల్లాపూర్, ధర్మారం సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ మహ్మద్ ఖాసీం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని కోరారు.