ఇల్లందకుంట శ్రీరాముడి సన్నిధిలో ఎంపీ బండి సంజయ్

572చూసినవారు
ఇల్లందకుంట శ్రీరాముడి సన్నిధిలో ఎంపీ బండి సంజయ్
శ్రీ రామ నవమి పురస్కరించుకొని ఇల్లందకుంట శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయాన్ని బుదవారం సాయంత్రం కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామనవమిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. బండి సంజయ్ కి ఆలయ అధికారులు అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్