విద్యార్థులు తల్లిదండ్రులకు, దేశానికి కీర్తి తేవాలి

78చూసినవారు
విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులతో పాటు దేశానికి కీర్తి తీసుకురావాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజురాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎంతోమంది గొప్ప నాయకులతో పాటు మంచి వృత్తిలో కొనసాగుతున్నారని అన్నారు. స్వర్గీయ పీవీ నరసింహారావు కూడా ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్