కార్పొరేటర్ల అకౌంట్లో రూ. 5 లక్షలు జమ: బండి సంజయ్

55చూసినవారు
ఈసీ తక్షణమే కాంగ్రెస్ నాయకుల బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలని కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ. కొందరు కార్పొరేటర్ల అకౌంట్లో 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారని, చేతికి 15 లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. తక్షణమే ఈసీ స్పందించి వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్