వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సందడి

65చూసినవారు
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సందడి
రాజన్న ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు శనివారం రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ఆంజనేయ స్వామి భక్తులు, స్వాములు రాజన్న దర్శించుకున్న తర్వాతే కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ఈ జయంతి సందర్భంగా మాల విరమణ చేస్తున్నట్లు వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్