రంజాన్ ఈద్ ఇంటివద్దనే జరుపుకోవాలి : మండల కో ఆప్షన్

686చూసినవారు
రంజాన్ ఈద్ ఇంటివద్దనే జరుపుకోవాలి : మండల కో ఆప్షన్
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అన్ని గ్రామాల ముస్లిం సోదరులు రంజాన్ ఈద్ ను ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని కోరుట్ల మండల కో-ఆప్షన్ సభ్యులు ఎం డీ ఖయ్యుం పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పట్టణంలో ఏర్పటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం కానున్న ఉపవాస దీక్షలు సందర్భంగా ముస్లిం సోదరసోదరీమనులు ప్రభుత్వం ఆదేశానుసారం ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని కోరారు. మస్జిద్ లలో సామూహిక ప్రార్థనలు నిషేధించబడింది కావునా అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి జకాత్ చెల్లింపు ఏదైనా ఉంటే నిరుపేదలకు నిత్యావసర వస్తువుల రూపంలో సామాజిక దూరం పాటించి సంబంధిత అధికారులకు సమాచారం అందించి పంపిణీ చేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్