ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కవ్వంపల్లి

83చూసినవారు
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. శంకరపట్నం మండల ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారము నిర్వహించిన షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వానికి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజా సంక్షేమం విస్మరించదని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్