శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులోని జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలకు వెళ్తే హుజురాబాద్ మండలం రాంపూర్ కి చెందిన ముద్రవేణి ప్రభాకర్, గోనెల సుదర్శన్, గోనెల శ్రీవర్షినిలు బంధువుల దశదినకర్మకు హాజరై తిరుగు ప్రయాణంలో సోమవారం ఉదయం కారులో వస్తుండగా కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొంది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.