మంథనిలో రైతుల ధర్నా

17663చూసినవారు
మంథనిలో రైతుల ధర్నా
పంటలకు సాగునీరు అందించాలని పెద్దపెల్లి జిల్లా మంథని మండల కేంద్రంలో మంగళవారం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ. పంట చేతికొచ్చే సమయానికి సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీరు అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. గోదావరిఖని మంథని ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్