మేడే ఉత్సవాలను విజయవంతం చేయాలి

64చూసినవారు
మేడే ఉత్సవాలను విజయవంతం చేయాలి
మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే ఉత్సవాలను విజయవంతం చేయాలని గౌతమి కార్మిక సంఘం వ్యవస్థాపకులు కొండేల మారుతీ కోరారు. బుధవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించుకునేందుకు ఐక్యమత్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల ప్రతినిధులు రామడుగు మారుతీరావు, రంగు శంకర్, తాటి బుచ్చన్న గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్