మంథని నియోజకవర్గం రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో శనివారం నూతనంగా నిర్మించిన పంచాయితీ భవనాన్ని, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను సబ్బండ వర్గాలను దృష్టిలో ఉంచుకొని రూప కల్పన చేశామని తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.