పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీఓ

71చూసినవారు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీఓ
రామగిరి మండలం పన్నూరు గ్రామంలో ఓటరు స్లిప్ ల పంపిణీ, పోలింగ్ కేంద్రాలను సోమవారం మంథని ఆర్డీఓ హనుమానాయక్ పరిశీలించారు. ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్ అందేలా చూడాలని, ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామచందర్ రావు, బీఎల్ఓలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్