మంథని మండలం సూరయ్యపల్లి గ్రామానికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ ఆకుల రాజబాపు కరీంనగర్ సాయికృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, సోమవారం జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆయన వెంట మంథని డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.