పోలింగ్ కేంద్రాల పరిశీలన

54చూసినవారు
పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఓదెల మండలంలోని గుంపుల జీలకుంట గ్రామాల్లో సోమవారం పోలింగ్ కేంద్రాలను పెద్దపల్లి ఆర్డీవో, ఏఆర్ఓ గంగయ్య పరిశీలించారు. గ్రామాల్లో పర్యటించి పోలింగ్ కేంద్రాలను సందర్శించి, సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం గుంపుల శివారులో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. ఆయన వెంట ఓదెల తహసిల్దార్ యాకన్న, ఆర్ఐ లు నర్సింగం, రాజేందర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్