ధర్మపురి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారిని సోమవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సత్కరించి స్వామి వారి ప్రతిమను బహూకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.