ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత

85చూసినవారు
ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత
ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని పెద్దపల్లి ఆర్డిఓ గంగయ్య అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి ఓటరు అవగాహన కార్యక్రమాన్ని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పూసాల రోడ్ చౌరస్తా వద్ద ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈకార్యక్రమంలో తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, సీఐ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, ఎంపిడిఓ దివ్యదర్శన్ రావు, ఆర్ఐలు స్వాతి, శ్రీవాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్