సింగరేణిలో కార్మికులకు సంబంధించి అనేకమైన సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఆర్జీవన్ జీడికే 1ఇంక్లైన్ లో కార్మికులను కలిసి కార్మికుడినే ఎంపి గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టిబిజికెఎస్ నాయకులు మిరియాల రాజిరెడ్డి, వడ్డేపల్లి శంకర్ తదితరులు పాల్గోన్నారు.