సిరిసిల్లలో కార్మికుడు ఆత్మహత్య

64చూసినవారు
సిరిసిల్లలో కార్మికుడు ఆత్మహత్య
సిరిసిల్ల పట్టణంలోని కేసీఆర్ నగర్‌కు చెందిన సిరిమల్ల శ్రీధర్ (34) అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ వరకు చదివి సాంచాలు నడుపుకుంటూ తల్లిదండ్రులతో ఉంటున్నాడు. కాగా, ఈ మధ్యకాలంలో సాంచాల పని బంద్ కావడంతో చేతిలో డబ్బులు లేక తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్‌ మృతితో కేసీఆర్‌ నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్