ఎల్ఓసి అందజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

569చూసినవారు
ఎల్ఓసి అందజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మండల కేంద్రంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన మారుపాక సాయిలు తండ్రి ఎల్లయ్య అనే అతనికి ఆరోగ్యం బాగాలేదని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసి ద్వారా (1, 60, 000)ఒక లక్ష అరవై వేల రూపాయలు మంజూరు చేశారు. ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు, కోనరావుపేట మండల నాయకులు, గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్