రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వనమహోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, పాఠశాల విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.