రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: రూరల్ బిజెపి నాయకులు

1579చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చి రైతులను ఆదుకోవాలని సోమవారం వేములవాడ రూరల్ బిజెపి అధ్యక్షుడు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్