వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం రాత్రి స్వామివార్లు అశ్వ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాతావరణం సరిగా లేకపోవడంతో ఆలయంలోపలనే ఊరేగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి సేవలో తరించారు.