తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం కీలక ప్రకటన చేశారు. త్వరలో జర్మన్ తత్వవేత్త, సోషలిస్టు నేత కార్ల్మార్క్స్ విగ్రహాన్ని చెన్నైలో ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు. ఇవాళ అసెంబ్లీ వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కార్ల్మార్క్స్ కాలంలోనే లేబర్ ఉద్యమం ఓ శతాబ్ధం పాటు కొనసాగిందన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుడు పీకే మూకియా థీవర్ స్మారక భవనాన్ని కూడా మధురై జిల్లాలో నిర్మించనున్నట్లు స్టాలిన్ తెలిపారు