ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసి కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తప్పించాలనేది కేసీఆర్ ప్లాన్ అని వివరించారు. అయితే ఈ కేసును సిట్ నుంచి బదిలీ చేసి సీబీఐకి అప్పగించాలని కోర్టు చెప్పడంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని రాధాకిషన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.