కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

70చూసినవారు
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ శనివారం జస్టిస్ నరసింహారెడ్డికి కమిషన్‌కు ఇచ్చిన వివరణపై బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఓ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ లేఖ హాస్యాస్పదం అన్నారు. విచారణ న్యాయ కమిషన్‌పై కేసీఆర్ ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. కమిషన్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు. నిజాలు బయటకు రావాలని, రేవంత్ సర్కారు విచారణ పేరుతో కాలయాపన చేయొద్దని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్