బెట్టింగ్ యాప్స్ కేసులో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. యాప్ల యజమానులే లక్ష్యంగా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 19 మంది బెట్టింగ్ యాప్ల ఓనర్లపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెలబ్రిటీలను సాక్షులుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.