మోదీని మూడోసారి ప్రధానిగా చూడాలని దళితులు ఆశపడుతున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అద్యక్షుడు కోటమర్తి సుదర్శన్ అన్నారు. ఆదివారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దేశంలో కరోనా సమయంలో దేశ ప్రజలను కాపాడుకునేందుకు మోదీచేసిన కృషి మరువలేనిదన్నారు. ఖమ్మం బీజేపీ ఎంపి అభ్యర్థి తాండ్ర వినోద్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయకులు రీగన్ ప్రతాప్ ఉన్నారు.