2024-25 విద్యాసంవత్సరానికి అనుమతి ఇవ్వకుండానే ప్రైవేట్ కళాశాలలు ప్రవేశాలు నిర్వహిస్తున్నాయని పీడీఎస్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేష్ ఆరోపించారు. గురువారం ఖమ్మంలో ప్రవేశాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాల సిబ్బంది, పీఆర్లను నాయకులు అడ్డుకున్నారు. ఇప్పటికై ముందస్తు ప్రవేశాలకు పాల్పడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ విద్యాసంస్థలను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.