ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులతో ధరణి దరఖాస్తులు, పెండింగ్ రిజిస్ట్రేషన్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్లో పొందుపర్చాలని, ఆపై ఆర్డీఓ, అక్కడి నుంచి అదనపు కలెక్టర్ కు చేరితే పరిష్కారం పూర్తవుతుందని తెలిపారు.