కూసుమంచి శివాలయానికి పోటెత్తిన భక్తులు

50చూసినవారు
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కూసుమంచి మండల కేంద్రంలో ఉన్న పురాతన శివాలయంకు భక్తులు పోటెత్తారు. చుట్టూపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహా శివునికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శమీ వృక్షానికి పూజలు చేసిన అనంతరం ప్రజలు పాలపిట్టను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శేషగిరిశర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్