వనమహోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రులు

77చూసినవారు
వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం సత్తుపల్లిలో నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖలు పాల్గొన్నారు. స్థానిక జేవీఆర్ కళాశాల నుంచి పాత సెంటర్ వరకు సుమారు 10వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలిని మంత్రులు జెండా ఉప్పీ ప్రారంభించారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన సాగింది.

సంబంధిత పోస్ట్