పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి

66చూసినవారు
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని ఐఎఫ్ టీయు జిల్లా నాయకుడు అమర్లపూడి శరత్ కోరారు. గురువారం సత్తుపల్లి ఏరియా ఆస్పత్రి వద్ద కార్మికులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఐదు నెలలుగా సిబ్బందికి వేతనాలు ఇవ్వక పోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికులకు వేతనాలు పెంచటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్