సీతారాములోరి కళ్యాణం వైభోగం జరిగింది. కళ్యాణ గడియలకు ముందు ఆయా గ్రామాలలో బుధవారం తలంబ్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. పీటలపై కూర్చొని కళ్యాణ తంతు నిర్వహించే పుణ్య దంపతులు తలంబ్రాలను వేదిక వద్దకు తీసుకువచ్చే సమయంలో మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం వద్ద సమర్పిస్తారు. కళ్యాణంలో ఆ తలంబ్రాలను ఆలయ పూజారులు సీతారాములపై పోస్తారు.